వనపర్తి: హామీల అమలుకై కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడాలి: సీపీఐ

75చూసినవారు
ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలపై కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారంలో మండల సభలో మాట్లాడుతూ. సీపీఐ ప్రజల పక్షాన వందేళ్లుగా పోరాడుతోందన్నారు. ఇంత ఘన చరిత్ర మరే పార్టీకి లేదన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో కార్మికుల, కర్షకుల హక్కులను హరిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీల అమలుకై పోరాడాలన్నారు.

సంబంధిత పోస్ట్