వనపర్తి: జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు
వనపర్తి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వివరాలు. జలగరి ముత్తు, దుల్లోల రాజు తాగుడుకు, జల్సాలు, కోడి పందేలు ఇతర వ్యసనాలకు అలవాటుపడి ఎలాంటి కష్టం చేయకుండా డబ్బులు సంపాదించాలని ఆశపడి పగటి పూట తాళం వేసి ఉన్న ఇళ్ళపై రెక్కి నిర్వహిస్తారు. పథకం ప్రకారం ఇంటి తాళాలు పగుల గొట్టి బంగారు, వెండి, నగదును దొంగతనం చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.