మిల్లర్లు ఎఫ్ సిఐకి ఇవ్వాల్సిన ధాన్యం క్లియర్ చేసి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే యాసంగి వరి ధాన్యం కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. గురువారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు యాసంగి వరి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ అప్పగింతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.