సాధారణ బదిలీలలో భాగంగా వనపర్తి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తూ ఐడు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న 29మంది కానిస్టేబుళ్లకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. పనిచేసే చోట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సాధారణమే అని అన్నారు.