TG: శంషాబాద్ విమానాశ్రయానికి మహా కుంభమేళా భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం 589 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో 84,593 మంది ప్రయాణం చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మేళాకు కుటుంబ సమేతంగా వెళ్తున్న వారిలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధికారులు మెరుగైన సేవలపై దృష్టి సారించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు ఏర్పాటు చేశారు.