సూపర్స్టార్ మహేశ్బాబు నటించిన క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అతడు’ మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ఆగస్టు 9న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక కౌంట్డౌన్ పోస్టర్ను విడుదల చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో భారీ హిట్గా నిలిచింది. ప్రేక్షకులు భారీ అంచనాలతో రీరిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.