తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ హైకమాండ్తో ఈ మేరకు చర్చలు జరుపుతున్నాట్లు సమాచారం. కొత్త కేబినెట్లోకి ముగ్గురు మంత్రులను తీసుకోవడంతో ఇంతకుముందున్న మంత్రుల శాఖలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవాళ మంత్రుల శాఖల్లో మార్పుపై ప్రకటన వెలువడనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ తనకొద్దంటున్నట్లు తెలుస్తోంది.