మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో 'MURUGA' అనే బుక్ను షేర్ చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కారణం ఏంటంటే... ఇలాంటి బుక్నే ఇటీవల హీరో ఎన్టీఆర్ కూడా పట్టుకుని కనిపించాడు. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న 'మురుగన్' మూవీలో మంజిమా మోహన్ హీరోయిన్గా నటిస్తుందన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.