బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూపీ సీఎం యోగి ఆధిత్య నాథ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముర్షీదాబాద్ అల్లర్ల తర్వాత ఆమె ఇమామ్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'యూపీ సీఎం మహా భోగి' అంటూ విమర్శించారు. ఆయన చాలా పెద్ద మాటలు చెబుతారని, మహాకుంభ మేళాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే ఎంతోమందిని యూపీలో ఎన్కౌంటర్ చేశారని అప్పడు యోగీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బెంగాల్ మీద విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలంటూ సూచించారు.