AP: మీర్పేట ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కంభంలో తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. శ్యాంబాబు(30) అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ముక్కలుగా నరికి బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు. అయితే సమీప బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.