బెల్లంపల్లి: అంగన్ వాడి కేంద్రాలకు సెలవులపై హర్షం

52చూసినవారు
బెల్లంపల్లి: అంగన్ వాడి కేంద్రాలకు సెలవులపై హర్షం
అంగన్ వాడి కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడం హర్షనీయమని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు భానుమతి శుక్రవారం అన్నారు. బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంగన్వాడి కేంద్రాలకు మే నెల సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్లను ప్రమోట్ చేశారని, యూనియన్ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందన్నారు.

సంబంధిత పోస్ట్