బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం 1 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ అంజయ్య, ఏఎస్ఐ నర్సయ్య హాజరై మాట్లాడారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా చక్కగా చదువుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.