బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో లింగాపూర్ గ్రామానికి చెందిన బానోత్ బలరాం SBI జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు. గత సంవత్సరం అతను మరణించారు. ఆయన పేరున రూ. 10,00,000 లక్షల ఇన్సూరెన్స్ మంజూరైంది. దీంతో గురువారం ఆకెనపల్లి బ్యాంకులో అతని భార్య బానోత్ రజితకు మంచిర్యాల రీజనల్ మేనేజర్ రితేష్ గుప్త, మేనేజర్ వీరభద్రరావులు భీమా చెక్కును అందజేశారు.