అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య అన్నారు. జనహిత అన్నపూర్ణ ఆరవ వార్షికోత్సవం పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రా చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత 330 సార్లు నిరుపేదలకు భోజనం అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు