
నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా టీడీపీ అభ్యర్థి
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని జగ్జీవన్రామ్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ క్రమంలో నిర్వహించిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సౌమ్యతో కలిపి కృష్ణకుమారికి 15 మంది మద్దతు లభించింది. వైసీపీ అభ్యర్థి ఓర్సు లక్ష్మికి కేవలం ముగ్గురు మాత్రమే మద్దతు తెలిపారు.