మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లిలో సందడి నెలకొంది. బజార్ ఏరియాలో పాత బస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు జాతరకు సంబంధించిన తాత్కారి దుకాణాలు వెలిశాయి. జాగారం చిప్పలు, పూలు, పండ్లు, కూరగాయలు, ఇతర పూజ సామాగ్రి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచే బజారు ఏరియాలో సందడి నెలకొనగా సాయంత్రం వరకు కోలాహలంగా మారింది. బుగ్గ జాతర నుంచి తిరుగు ప్రయాణమైన భక్తులు పోటాపోటీగా కొనుగోలు చేశారు