బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. గని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పంచశీల జెండాను ఎగరవేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.