మహారాష్ట్రకు చెందిన మోహన్ దుర్వే మద్యం మత్తులో కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడని వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య శనివారం తెలిపారు. మహారాష్ట్ర నుండి వచ్చిన ఆయన బెల్లంపల్లి పాత బస్టాండు వైన్ షాప్ వద్ద అతిగా మద్యం సేవించాడు. కాసేపటికే మద్యం మత్తులో కింద పడగా తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయింది. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాల కు రెఫర్ చేశారు.