కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాభివృద్ధికి శాపంగా ఉందని ఆరోపిస్తూ బుధవారం సిఐటియు కార్యాలయం వద్ద నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆ సంఘం మండల కన్వీనర్ చల్లూరి దేవదాస్ మాట్లాడుతూ బడ్జెట్ బడా బాబులకు ఎర్ర తివాచీ పరిచే విధంగా, మధ్యతరగతి ఉద్యోగులను మభ్య పెట్టేలా ఉందని విమర్శించారు. ఉపాది, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.