బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి కొద్ది రోజుల్లోనే పూర్వ వైభవం వస్తుందని ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ మధు కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం, రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రుల నుంచి డిప్యూటేషన్లపై ప్రత్యేక వైద్య నిపుణులు తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలో పూర్తి నియామకం చేయనున్నట్లు తెలిపారు.