బెల్లంపల్లి పట్టణంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు శనివారం కొరడా ఝలిపించారు. బెల్లంపల్లి కన్నాల రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాన్ని తాసిల్దార్ జోష్ణ ఆధ్వర్యంలో జెసిబి సాయంతో అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.