తాండూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తాండూరు మండల ప్రత్యేక అధికారి గజానంద్ సూచించారు. స్థానిక అధికారులతో కలిసి ఆయన కేజీబీవీని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ ప్రభాకర్, ఏఈ విష్ణుకుమార్, కేజీబీవీ ప్రత్యేక అధికారి సుమన చైతన్య పాల్గొన్నారు.