బెల్లంపల్లిలోని రడగంబాల బస్తి, 24వ వార్డులో కట్ట మైసమ్మ బోనాల పండుగను బుధవారం బస్తీ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు బస్తీ ప్రజలు తెలిపారు.