అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను కన్నెపల్లి ఎస్సై గంగారాం పట్టుకున్నారు. శనివారం జజ్జరవెళ్లి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న కొట్రంగి రాజ్ కుమార్, దునే కృష్ణ, వడిగురి రాజన్న, వడూగురి పోషన్నల ట్రాక్టర్లను పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. భవిష్యత్తులో అనుమతి లేకుండా తీసుక రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.