ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లో తీసుకెళ్లాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కొయ్యల ఏమాజి పిలుపునిచ్చారు. బుధవారం కన్నెపల్లి మండలంలోని మాడవెల్లి గ్రామంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.
మోడీ 11 సంవత్సరాల పాలనలో భారతీయులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.