కన్నేపల్లి మండలం జజ్జరవల్లి గ్రామం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు కన్నేపల్లి ఎస్సై గంగారం శనివారం తెలిపారు పక్కా సమాచారం మేరకు నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక, మట్టిని తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు .