

ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్కు చెందిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒకొక్కరి నుంచి 5 కిలోల చొప్పున రూ.10.092 కిలోల బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.8 కోట్లు ఉంటుందని అంచనా. వారిపై అధికారులు కేసు నమోదు చేశారు.