అరవింద్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల అధికారికి ఎంసీపీఐయూ నాయకులు పసులేటి వెంకటేష్ గురువారం ఫిర్యాదు చేశారు. 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి అదనపు చార్జీలు తీసుకోకుండా ఫ్రీగా డెలివరీ చేయాల్సి ఉండగా, ఏజెన్సీ వాళ్ళు 3రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని, 877 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ 880రూపాయలు తీసుకొని చిల్లర డబ్బులు 3రూపాయలు ఇవ్వటం లేదన్నారు.