ప్రభుత్వం, అధికారుల విఫలంతో వరకట్న వేధింపులకు, హత్యలకు మంచిర్యాల జిల్లా నిలయంగా మారిందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. హాజీపూర్ మండలం గొల్లపల్లి మండలంలో ఇటీవల నవ వధువు కంది శృతి అదనపు వరకట్నం కోసం భర్త, అత్త, మామ చేతిలో హత్యకు గురైందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.