ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

59చూసినవారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని బిజెపి నాయకులు వెంకటకృష్ణ, కళ్యాణి, సంతోష్ లు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా ఉండడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్