ఎన్ఎస్యుఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా సాయికుమార్ గురువారం నియామకమయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు ఆదర్శ వర్ధన్ నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. సాయికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో పదవి రావడానికి సహకరించిన పార్టీ పెద్దలు, నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండి కృషి చేస్తానని వెల్లడించారు.