నీల్వాయి సబ్ స్టేషన్ పరిధిలోని సుంపుటం నుండి గొర్లపల్లి వరకు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదకరంగా మారగా ఆ విద్యుత్ స్తంభాలను తొలగించారు. బుధవారం ఏఈ దీక్షిత్ కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడంతో ప్రజలు, పాదచారులు, వాహనదారులు సంబంధిత శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.