రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. వేమనపల్లిలోని నీల్వాయి గ్రామ పంచాయతీలో ఆర్ అండ్ బీ నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టగా, రోడ్డుకు ఇరువైపుల మొరం పోయడంతో డ్రైనేజీ నుంచి వచ్చే మురికి నీటితో కలిసి ఎర్రమట్టి చిత్తడిగా మారింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఇబ్బందులు లేకుండా చూడాలని వాహన దారులు కోరుతున్నారు.