వేమనపల్లి మండలంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం ప్రారంభించారు. ఈ నెల 16వ తేదీ నుండి వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని పశు వైద్యాధికారులు డాక్టర్ పవన్, సుప్రియ గాలికుంటు వ్యాధి సోకకుండా గురువారం టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామాల్లో టీకాలు వేయడం జరుగుతుందన్నారు.