తనపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు ఆవరణలో బెల్లంపల్లికి చెందిన మహిళ న్యాయవాది మమత నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ మరికొందరి బలంతో తనపై దాడి జరిగినట్లు బాధితురాలు సహచర న్యాయవాదులకు తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తనకు న్యాయం చేయాలని బాధితురాలు అయిన మమత చంటి పాపతో నిరసన చేయడం చర్చనీయాంశం అయింది.