చెన్నూర్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని గనులు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఆదివారం చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించారు. అనంతరం వ్యాధులపై, వృత్తులపై, ఉపాధిపై అక్కడివారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.