మోడీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అద్వితీయమని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం చెన్నూరు పట్టణంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వం ఆర్థిక విధానాల కారణంగా ప్రపంచంలో భారత్ నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు.