క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌక్ లో కూరగాయల వ్యాపారస్తులకు తాత్కాలిక షెడ్లును నిర్మించాలని మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ డిమాండ్ చేశారు. గురువారం వ్యాపారస్తులతో కలిసి కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారికి గత సంవత్సరం మంజూరు అయిన నిధులతో షెడ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరారు.