
భారీగా పెరిగిన బంగారం ధరలు
గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.750 పెరిగి రూ.90,200కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.820 పెరిగి రూ.98,400కి చేరింది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర 1,19,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.