భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూలీలు, మేస్త్రీలు అందరూ ఏకమై కొట్లాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు. మందమర్రి సివిఆర్ క్లబ్ లో జిల్లా మూడవ మహాసభలలో మాట్లాడారు. ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో కొట్లాడు తెచ్చుకున్న హక్కులను హరించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నారన్నారు.