మందమర్రి పట్టణంలోని జిఎం కార్యాలయ సమీప జాతీయ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహంకాళి భూదేవి (65) కారు ఢీకొని మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. జిఎం కార్యాలయం వైపు కిరాణా దుకాణానికి వెళ్లి ఇల్లందు క్లబ్ వైపు తిరిగి వస్తుండగా కారు అతివేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.