మందమర్రి ఏరియాలోని కేకే 1 గని వద్ద బుధవారం 350 H. P సబ్ మెర్సిబుల్ పంపును ఏరియా జి. ఎం జి. దేవేందర్ ప్రారంభించారు.. కొన్ని కారణాలతో కేకే–5 గని నుండి వచ్చే నీటి సరఫరా కొంతకాలం నిలుపుదల చేస్తున్నట్లు జిఎం పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా కేకే–1 గని నీటిని బోర్ వెల్ ద్వారా పైకి తీసుకువచ్చి శుభ్రం చేసి కాలనీ లకు నీటి సరఫరా మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ AGM E&M వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, సివిల్ ఎ. స్. ఈ రాము, సివిల్ ఎస్. ఈ జయప్రకాష్, కేకే ఓసి ఇంజనీర్ నాగ సంతోష్, సివిల్ సూపర్వైజర్ రాకేష్ పాల్గొన్నారు.