మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని గోదావరినదిలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిచూడగా మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో కుళ్లిపోయి ఉందన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుని సమాచారం తెలిసిన వారు 8712656534 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.