మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పట్టణంలోని మారుతీ నగర్ అంగన్ వాడీ కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ టీచర్ కనుకుంట్ల తిరుమల మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. అనంతరం చేతుల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సునంద, సహాయకురాలు విక్టోరియా పాల్గొన్నారు.