మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు మండలాల్లో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గురువారం పర్యటించనున్నారని సీపీఎం జన్నారం మండల నాయకులు అంబటి లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా జన్నారం మండల పార్టీ సభ్యులు పర్యటనలో పాల్గొనుటకు వెళ్తున్నారని లక్ష్మణ్ అన్నారు. వారిలో నాయకులు కొండ గొర్ల లింగన్న, కూకట్ కారు బుచ్చయ్య, దాసండ్ల రాజన్న, అంబటి లక్ష్మణ్, అంబటి సువర్ణ, తదితరులు ఉన్నారు.