ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి తో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ధరణితో గతంలో కొన్ని సమస్యలకు పరిష్కారం లభించగా రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. భూ భారతి తో మాత్రం చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.