వేసవికాలంలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని లక్షేట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్ తెలిపారు. వేసవి కాలం కావడంతో ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు సమీపిస్తుండడంతో మనది గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి పిల్లలు సమీపంలోని గోదావరిలో, వ్యవసాయ భావుల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.