పచ్చి రొట్టె ఎరువులు అయిన జీలుగ విత్తనాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని జన్నారం క్లస్టర్ AEO త్రిసంధ్య తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పొన్కల్ లో 917, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 300 బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జన్నారం క్లస్టర్ లోని పలు గ్రామాల రైతులు అవసరం ఉన్న వారు పొన్కల్ రైతు వేదిక వద్దకు వచ్చి పర్మిట్ తీసుకోవాలని కోరారు.