జన్నారం: పని స్థలాల్లో ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటించాలి

65చూసినవారు
జన్నారం: పని స్థలాల్లో ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటించాలి
పని స్థలాల్లో ఉపాధి కూలీలు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని జన్నారం మండల ప్రభుత్వ వైద్య సిబ్బంది సూచించారు. జన్నారం మండలం శివారులో గురువారం ఉపాధి పని చేస్తున్న కూలీలకు కార్యదర్శి శ్రీపాల్ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండలో పనిచేసే సమయంలో కూలీలు టోపీ లాంటివి ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేటు రాజు, ఆశా కార్యకర్త మాధవి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్