

ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 48 మందితో ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దాంతో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. టబాస్కో రాష్ట్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. బస్సులో మంటలు వ్యాపించడంతో 38 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 30 మందికి చెందిన అవశేషాలను గుర్తించారు.